Saturday, April 20, 2024
- Advertisement -

అనసూయపై నెటిజన్లు ఫైర్.. ఏమైంది ?

- Advertisement -

దిశ అత్యాచారం హత్య సంఘటన తర్వాత దేశవ్తాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో దిశను హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియాలో సమాజంలో మార్పు రావాలంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేసే హీరోయిన్స్ కూడా తాము ధరించే వస్త్రధారణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని.. మనుషులను రెచ్చగొట్టే విధంగా హాట్ డ్రెస్ లు వేసుకోవద్దని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ అనసూయ అసభ్యంగా కొన్ని ఫోటోల్లో కనబడింది. దిశ విషయంలో అనసూయ ఓ రెంజ్ లో లెక్చర్ ఇచ్చింది.

అలాంటి అనసూయ.. ఇప్పుడు హాట్ డ్రెస్సులు వేసుకుని సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు పిల్లలు ఉండి కూడా సినిమా ఛాన్స్ ల కోసం సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫోటోలు పెడతారా ? అని ఆమెపై ఫైర్ అవుతున్నారు. అలాగే మీ భర్త తలకు మసాజ్ చేస్తూ మీరు తొడలు కనపడుతూ పెట్టిన ఫోటో గురించి ఏం చెప్తారు అని ? కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

టీవీ షోలు, సినిమాల్లో ఛాన్సల కోసం ట్రై చేసుకుంటే తప్పు లేదు కానీ ఇలా హాట్ డ్రెస్ లు వేసుకుని కుర్రకారును రెచ్చ గొడుతూ బయట సభ్య సమాజం గురించి నీతులు చెప్పడం కాదు ముందు నువ్వు మారు అని అనసూయపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పుడైన అనసూయ తన హాట్ నెస్ ను తగ్గిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -