Tuesday, April 23, 2024
- Advertisement -

స్టార్ హీరో పై కంప్లైంట్ ఇచ్చిన కో-డైరెక్టర్..?

- Advertisement -

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు కూడా ముఖ్య పాత్ర పోషించబోతోంది. తాజాగా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కి మరియు కో డైరక్టర్ సత్యం కి పెద్ద గొడవ జరిగిందని తెలుస్తోంది. దీంతో కో డైరక్టర్ సత్యం డైరెక్టర్స్ అసోసియేషన్ లో అల్లు అర్జున్ పై కంప్లైంట్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలో కో డైరక్టర్ సత్యం షాట్ రెడీ అయిందని అల్లు అర్జున్ ని మూడు సార్లు పిలిచారట.

అన్ని సార్లు చెప్పినా వినకుండా అనేకసార్లు పిలవడం తో కోపం తెచ్చుకున్న అల్లు అర్జున్ స్క్రిప్ట్ పేపర్లు గాల్లోకి విసిరేసి కో డైరెక్టర్ పై గట్టిగా అరిచాడట. ఈ నేపథ్యంలో కో-డైరెక్టర్ అల్లు అర్జున్ పై డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడని సమాచారం. కానీ తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పై డైరెక్టర్స్ అసోసియేషన్ లో అలాంటి ఫిర్యాదు ఏమీ నమోదు అవ్వలేదట. మరి ఈ షూటింగ్ సెట్స్ లో ఏం జరిగిందో అక్కడ ఉన్న వారు తప్ప ఇంకెవరు చెప్పలేరేమో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -