Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్‌?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.సినిమాను ద‌సరా బ‌రిలో నిల‌ప‌ల‌నే క‌సితో షూటింగ్‌ను శేర‌వేగంగా జ‌రుపుతున్నారు.ప్ర‌స్తుతం సినిమాలోని కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ఆడియో ఈవెంట్ వేడుక తేదీని ఫిక్స్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ‘నోవాటెల్’ హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.

త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ‌బుల్ రోల్ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.అర‌వింద స‌మేత‌తో త‌న స‌త్తా చాట‌ల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌.అజ్ఞాతవాసి ప్లాప్‌తో త్రివిక్ర‌మ్‌కు చాలా చెడ్డ పేరు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ఇక సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -