తెలుగులో మొట్టమొదటి రియాల్టీ షో అయిన బిగ్బాస్ మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే.మొదటి సీజన్ అంతటి హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.దీంతో రెండో సీజన్కు కూడా ఎన్టీఆరే యాంకర్గా వ్యవహరిస్తాడని అందరు భావించారు.కాని త్రివిక్రమ్తో సినిమా ఉండటం వల్ల బిగ్బాస్ రెండో సీజన్కు దూరం అయ్యారు ఎన్టీఆర్.ఇక బిగ్బాస్ రెండో సీజన్కు న్యాచురల్ స్టార్ నాని యాంకర్గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ తండ్రి నటుడు,మాజీ ఎంపీ హరికృష్ణ ఈ రోజు(బుధవారం) రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఒకవేళ ఎన్టీఆర్ బిగ్బాస్ రెండో సీజన్కు యాంకర్గా చేసి ఉంటే కనుక అటు బిగ్బాస్ టీం,ఇటు ఎన్టీఆర్ ఇద్దరు ఇబ్బంది పడేవారని కొందరు చర్చించుకుంటున్నారు.తండ్రి మరణంతో ఎన్టీఆర్ బిగ్బాస్ షో నుంచి మధ్యలోనే తప్పుకునేవారని,దీంతో బిగ్బాస్ టీం మరోకరిని ఆయన స్థానంలో తీసుకుంటే కనుక అది బిగ్బాస్కు పెద్ద మైనస్గా మారేదని చర్చించుకుంటున్నారు.ఆయన బిగ్బాస్ రెండో సీజన్ నుంచి తప్పుకోవడమే మంచిదైందని కొందరు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.