Friday, March 29, 2024
- Advertisement -

కుష్బూని ఇప్పుడు చూస్తే ఎవరైన షాక్ కావాల్సిందే..!

- Advertisement -

సెలబ్రిటీలు.. కొన్ని విషయాల్లో పట్టుదలతో ఉంటారు. సినిమాల్లో నటిస్తున్నావారు తమ పాత్ర కోసం ఏ విధంగా తయారు అవ్వమన్న అవుతారు. ఐ సినిమా కోసం విక్రమ్ సిక్స్ పాక్ చేశాడు. అలానే ఎవరు ఊహించన్నంత బరువు తగ్గి ఆ సినిమాలో నటించాడు. అనుష్క సైజ్ జీరో సినిమా కోసం చాలా బరువు పెరిగిన విషయం తెలిసిందే.

ఇక కొందరు నటీనటులు సినిమాల్లో నటించకపోయినా.. తమ బరువును తగ్గించుకుంటున్నారు. అయితే తాజాగా ప్రముఖ కథానాయిక కుష్బూ చూస్తే ఎవరైన ఆశ్చర్యపోవాల్సిందే. కుష్బూ పూర్తి స్లిమ్ముగా అయిపోయింది. లావుగా కనిపించే కుష్బూ ఫొటోలను చూసి ఈమె ఆమేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సన్నగా.. నాజుగ్గా గుర్తుపట్టలేనంతగా బక్కపలుచుగా కుష్బూ ఇప్పుడు మారిపోయింది. కుష్బూ కథనాయికగా కథనాయికగా సన్నగా ఉండేవారు. పెళ్లి తర్వాత చాలా లావయ్యారు. సినిమాలు టీవీ సీరియల్స్ లో తల్లి పాత్రలు పోషిస్తున్నారు. అయితే లాక్ డౌన్ వేళ కుష్బూ తన లావుతనంపై పెద్ద యుద్ధమే చేశారు.

అందుకే ఏకంగా వ్యాయామంతో 15 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్ గా తయారయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుష్బూను అంత సన్నగా.. గ్లామర్ గా చూసి అందరూ షాక్ అవుతున్నారు. మూడు నెలల్లోనే 15 కిలోలు బరువు తగ్గిన కుష్బూ తాజాగా రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్త’ చిత్రం కోసమే ఇలా బరువు తగ్గారని సమాచారం. మరి బరువు తగ్గడం వల్ల కుష్బూకు వరస అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -