Wednesday, April 24, 2024
- Advertisement -

100 కోట్ల బ‌డ్జెట్ తో పవన్ మూవీ..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిక్స్ అయింది. బాలీవుడ్ మూవీ పింక్ సినిమాని తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంతో పాటు క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది జానపది చిత్రం. ఈ భారీ చిత్రంను ఎ.ఎం రత్నమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంను ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని క్రిష్ చూస్తున్నాడు. బహుబలి సినిమాలో ఉన్నట్లే భారీ సెట్టింగులు ఈ చిత్రంలో ఉంటాయట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని ఎ.ఎం రత్నం రాజీపడకుండా నిర్మించాలి అనుకుంటున్నారని తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు.. ఈ భారీ సినిమాకి 100 కోట్ల బ‌డ్జెట్ అవుతుందట. ఇది పవన్ కెరీర్లో భారి బడ్జెట్ మూవీ. హిందీ మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -