Friday, April 26, 2024
- Advertisement -

దిశ కేసులో వాళ్లకు సరైన శిక్షే.. కానీ : రేణు దేశాయ్

- Advertisement -

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. విషయంలోకి వెళ్తే.. వారిని చంపేయడం కరెక్టే కానీ అంటూ కొన్ని లాజిక్స్ చెప్పింది.

ఇలా ఇష్టమొచ్చినట్లు చంపుకుంటూ పోతే ఏం చెప్పాలంటూ ప్రశ్నించింది రేణు దేశాయ్. ఆ నలుగురు నిందులు చేసింది క్షమించరాని నేరం.. కాబట్టి వాళ్లను చంపడం కరెక్టే కానీ.. అదే స్థానంలో మంత్రి కొడుకు ఉంటే ఇలాగే నడిరోడ్డు మీద కాల్చేస్తారా ? అంటూ ప్రశ్న లేవనెత్తి సంచలనం సృష్టించింది రేణు దేశాయ్. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టే ఆలా జరిగింది.. అదే అక్కడ పెద్దోళ్ల కొడుకులు ఉంటే చంపేంత దమ్ము ఎవ్వరికీ ఉండకపోయేదని రేణు చెప్పుకొచ్చింది.

తప్పు చేసిన ఏ ఒక్కరికైనా కచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ.. పడాల్సిన రీతిలో పడాలని అంటోంది రేణు. దేశంలోని అందరికీ ఒకేలా న్యాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెబుతోంది. చట్టానికి వాడు, వీడు అనే తేడా లేకుండా తప్పు చేసిన ఎవడికైనా ఒకేలా శిక్ష పడేలా మార్పు రావాలని కోరుకుంది రేణు. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

అలానే కుంటుంబం నుంచే మార్పు రావాలని.. పిల్లలను చిన్నతనం నుంచే సమాజం, స్త్రీల పట్ల గౌరం వంటివి నేర్పించాలని.. కేవలం ఆడవాళ్లనే జాగ్రత్తగా ఉండమని చెప్పడం కాదు.. మగాళ్ళకు కూడా ఆడవాళ్లను ఎలా గౌరవించాలో నేర్పిస్తే.. సమాజంలో ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావని రేణు చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -