Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ పై ఫైర్ అవుతున్న అభిమానులు

- Advertisement -

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమా తోనే. బాహుబలి పాత్రలో ప్రభాస్ తన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు. అలాగే బాలీవుడ్ లో కూడా కొంత మంది అభిమానులను ఏర్పరుచుకున్నాడు ప్రభాస్. అయితే బాలీవుడ్ తో పోల్చుకుంటే ప్రభాస్ కి టాలీవుడ్ లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. పైగా ప్రభాస్ సినిమాలకు కూడా హిందీలో కంటే తెలుగులోనే ఎక్కువ డిమాండ్ ఉంది.

అయినప్పటికీ ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ పైన ఆసక్తి చూపించటం టాలీవుడ్ అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. ‘సాహో’ సినిమా మార్కెట్ పెంచటం కోసం సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధకపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడమే కాక దాదాపు మిగతా నటీనటులు కూడా బాలీవుడ్ కి చెందిన వారినే తీసుకున్నారు. తెలుగులో సినిమా తీస్తూ హిందీ మరియు తమిళ నటీనటులను ప్రధానంగా పెట్టుకోవడం అక్కడ మార్కెట్ కు సెట్ అయ్యేలాగా పాటలు కూడా చేయించడం అభిమానులకు బాధ కలిగిస్తుంది. అసలు ప్రభాస్ హీరో గా మారింది తెలుగు ఇండస్ట్రీలో. ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయింది బాహుబలి వంటి తెలుగు సినిమాతో. అలాంటిది ప్రభాస్ సాహో విషయంలో మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పెట్టుకోవడంతో అభిమానులు ప్రభాస్ పై మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -