Wednesday, April 24, 2024
- Advertisement -

౩౦౦కోట్ల బడ్జెట్ లో సంగం ప్రభాస్ కే, అమితాబ్, దీపికాకే..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంతకముందు లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరించనున్నాడని తెలిపారు. అయితే త్వరలోనే మరికొంత మంది స్టార్స్.. స్టార్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నారని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులను కూడా తీసుకురానున్నారట.

దాదాపు రూ.250 – 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేసుకున్నారట. దీనిని బట్టి చూస్తే బడ్జెట్ లో సగ భాగం రెమ్యూనరేషన్స్ కే కేటాయించే అవకాశం ఉంది. దాదాపుగా ప్రభాస్ కి 50 కోట్లు, అమితాబ్ కి 25కోట్లు, దీపిక కు 20 కోట్ల వరకు చెల్లిస్తున్నారట. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నాగ్ ని బిట్టు అని ఎందుకు పిలిచానంటే.. : సుజాత

టైం అడిగిన క్రిష్.. వేరే సినిమా కు వెళ్ళిన పవన్..?

సమ్మర్ కే తొడ కొడతానంటున్న బాలయ్య బాబు..!

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -