Thursday, April 25, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రియమణి.. ఎందుకు ?

- Advertisement -

తెలుగులో ఢీ షోకి విపరితమైన క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా చాలా మంది డాన్స్ మాస్టర్లుగా ఎదిగారు. అయితే ఇటివలే ఈ షోలోకి మళ్లీ యాంకర్ రవి ఎంట్రీ అయ్యాడు. అయితే రవి వచ్చినప్పటి నుంచి సుడిగాలి సుధీర్ తన గుర్తింపు కోసం చాలా పాట్లు పడుతున్నాడు. రవితో ఎనర్జీని మ్యాచ్ చేయడం కోసం చాలా ఫీట్లు పడుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రసారం అయిన ఢీ షోలో సుడిగాలి సుధీర్ ఒక వెరైటీ ప్రయోగం చేశాడు. ఈ సారి జడ్జిలు అయిన శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఇవేవి పట్టించుకుని సుడిగాలి సుధీర్ ప్రియమణి మేకప్ మీద జోకులేశాడు. అంతేకాకుండా ఆమె భాషను సైతం వెక్కిరించాడు. ఇదంతా జోక్ అనుకుంటూ అంతా నవ్వుకున్నప్పటికి ప్రియమణి మాత్రం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

అయితే సుధీర్ పై ప్రియమణి సీరియస్ అయినప్పుడు పక్కేనే ఉన్న శేఖర్ మాస్టర్ కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు సుడిగాలి సుధీర్ మాత్రం ఇవేవి పట్టనట్లు వ్యవహరించడంపై ప్రియమణి అభిమానులు సోషల్ మీడియాలో సుధీర్ పై విమర్శలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -