నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ షో ఎంతో ఉత్కంఠంగా సాగి తాజాగా మురిసింది. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చిన ఈ ఫైనల్ చాలా గ్రాండ్ గా సాగింది. చిరంజీవి చేతుల మీదగా రాహుల్ ట్రోపీ అందుకున్నాడు.
అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. రాహుల్ గెలుపు వెనక ఇద్దరు ముద్దుగుమ్మలు ఉంన్నారన్నది ప్యాన్స్ విశ్లేషణ. అందులో శ్రీముఖి ఒకరు.. పునర్నవి ఇంకొకరు. బిగ్ బాస్ ఫస్టాఫ్ ఆద్యంతం పునర్నవి తో లవ్ స్టోరీ వేడెక్కించింది. పున్నూ వెళ్లిపోతున్నప్పుడు రాహుల్ వెక్కి వెక్కి ఏడ్వడం ప్రపంచంలోని ప్రేమికులందరికీ కనెక్టయిపోయి రాహుల్ పై సింపతి వచ్చింది.
దాంతో పాటే పదే పదే లేడీ విలన్ లా శ్రీముఖి .. తన శత్రువు అయిన రాహుల్ ని నామినేట్ చేస్తుండడంతో తన ఉద్ధేశం నచ్చని చాలా మంది ప్రేక్షకులు రాహుల్ కే మద్ధతునిచ్చారు. అలా ఆ ఇద్దరు గాళ్స్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ గెలుచుకునేందుకు సాయమయ్యారన్నమాట. లేదంటే బిగ్ బాస్ విజేతగా నిలిచిన ఏకైక లేడీగా శ్రీముఖి రికార్డులకెక్కేది. చివరికి రన్నర్ గా నిలవాల్సొచ్చింది. రాహుల్ విజేత గా 50 లక్షలు అందుకున్నాడు.