Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీముఖికి ఫోన్ చేస్తే.. అలా బిహేవ్ చేసింది : రాహుల్

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ లో ఉన్నప్పుడు రాహుల్, శ్రీముఖి బాగా కొట్టుకునేవారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయిన మంచి ఫ్రెండ్స్ గా ఉంటారని అందరు భావించారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా వారి మధ్య వార్ జరుగుతున్నట్లే అర్దం అవుతోంది. తాజాగా నవంబర్ 29న రాహుల్ ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.

తాను చేయబోయే లైవ్ కన్సర్ట్ కు చాలా మంది సెలెబ్రిటీస్ కూడా వస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా బిగ్ బాస్ నుంచి కూడా అందర్ని పిలిచానని చెప్పాడు. ముఖ్యంగా తన గ్యాంగ్ అయితే ఖచ్చితంగా వస్తారని అన్నాడు. పున్ను, వరుణ్ సందేశ్, వితిక మాత్రం 100 పర్సెంట్ వస్తారని కన్ఫర్మ్ చేసాడు. ఇక శ్రీముఖి విషయంకు వచ్చేసరికి కాస్త డిఫరెంట్ గా జవాబు ఇచ్చాడు రాహుల్.

తాను రెండు రోజుల క్రితం శ్రీముఖికి కాల్ చేశానని.. అయితే తన ఫోన్ వేరే వాళ్లు ఎత్తి షూట్ లో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. నేను రాహుల్ మాట్లాడుతున్నానని చెప్తే ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేసాడన్నట్లు ఫోజ్ కొట్టారని రాహుల్ చెప్పాడు. శ్రీముఖికి తాను ఫోన్ చేసినట్లు తెలిసినప్పటికి తిరిగి కాల్ చేయలేదని.. ఇంట్లో జరిగిన విషయాలను ఆమె ఇంకా గుర్తు పెట్టుకుందేమో అని ఆమెపై సెటైర్ వేశాడు.

తాను మంచి ఫ్రెండ్ గా కాల్ చేస్తే.. ఆమె ఇంకా మనసులో ఏదో పెట్టుకుంటే ఎవరు ఏం చేయాలేరని అన్నాడు రాహుల్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి బిజీగా ఉందని.. తాను ఫోన్ చేసిన సంగతి గుర్తుందో లేదో అంటూ సెటైరికల్ కమెంట్ చేసాడు. రాహుల్ మాటలు చూస్తుంటే కచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్ మాత్రం అలాగే ఉందని తెలుస్తోంది. మరి రాహుల్ ఈవెంట్ కి శ్రీముఖి వెళ్తుందో.. లేదో.. చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -