Friday, April 19, 2024
- Advertisement -

ఆ ఇద్ద‌రి హీరోల‌కి ..హీరోయిన్లు వీళ్లేనా?

- Advertisement -

టాలీవుడ్‌లో ఫ్లాప్ లేని ద‌ర్శ‌కుడు ఎవ‌రు అంటే అంద‌రు ఠ‌క్కున ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి పేరు చెబుతారు.ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెలుగులో న‌యా మల్టీస్టార‌ర్‌కు రంగం సిద్దం చేస్తున్నాడు. రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ప్పటికే ఈసినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.తాజాగా ఈ సినిమాలో తారక్‌, చరణ్‌లకు హీరోయిన్లు వీళ్లే అంటూ ఓ వార్త టాలీవుడ్‌ సర్కిల‍్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్‌కు జోడిగా కీర్తిసురేష్‌, చెర్రీకు జంటగా పూజ హెగ్డేలు కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరు భామలు మంచి ఫాంలో ఉండటంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా స్వాతంత్య్ర‌ సమరం నాటి కథ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన రాలేదు.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నాడు.ఇక రామ్ చ‌ర‌ణ్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.వీరిద్ద‌రి ఈ సినిమాలు పూర్తి అవ్వ‌గానే రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌కు షిఫ్ట్ అవుతారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -