Saturday, April 20, 2024
- Advertisement -

ధృవ వర్జినల్ దర్శకుడితో రామ్ చరణ్ తేజ సినిమా..?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ కూడా ఓ హీరో కాగా ఈ సినిమా కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది.. ఇద్దరు హీరోలు ఉండడంతో ఇద్దరి హీరోల అభిమానులు సైతం ఈ సినిమా హిట్ కోసం పరితపించిపోతున్నారు.. ఈ సినిమా కంటే ముందు ఇద్దరి హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు కాగా ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి..

ఇక ఎన్టీఆర్ RRR తర్వాత నెక్స్ట్ సినిమా ని సెట్ చేసుకున్నాడు.. త్రివిక్రమ్ తో సినిమా ని ఇప్పటికే అనౌన్స్ చేయగా వీరి కాంబో లో వస్తున్న రెండో సినిమా ఇది.. ఎటొచ్చి రామ్ చరణ్ ఇంతవరకు ఏ సినిమా ని ఓకే చేయలేదు. మేర్లపాక గాంధీ, ప్రశాంత్ నీల్, వెక్కి కుడుములు వంటి దర్శకుల పేర్లు బయటకి వచ్చిన అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు.. తాజా సమాచారం మేరకు ఎవరూ ఊహించని ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇతని గురించి తెలిస్తే రిస్క్ అనిపించక మానదు. చిరంజీవి హిట్లర్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఎడిటర్ మోహన్ పెద్దబ్బాయి మోహన్ రాజా తో రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడట..

తమిళ్లో తని ఒరువన్ సినిమా చేసిన మోహన్ రాజా కి తెలుగులో మంచి డిమాండ్ ఉంది..  దీన్నే తెలుగులో రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డి ధృవగా రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ఆ టైంలోనే మోహన్ రాజా టేకింగ్ మీద గురి కుదిరిన రామ్ చరణ్ తగిన కథ దొరికితే చేద్దామని చెప్పాడట. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయని ఫ్రెష్ అప్ డేట్. మోహన్ రాజా ప్రస్తుతం ప్రశాంత్ తో అందాదున్ రీమేక్ పనుల్లో ఉన్నాడు. అది త్వరగానే పూర్తి చేసి మెగా పవర్ స్టార్ తో సినిమాకు రెడీ కావొచ్చని చెన్నై టాక్.

విజయ్ తమ్ముడికి బాగానే ఖర్చు పెట్టారుగా..?

ఇన్ని సార్లు రీ షూట్ చేస్తే ఎలా చైతు..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సునీల్..?

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -