Friday, April 19, 2024
- Advertisement -

‘మేము సైతం’ కోసం రామ్‌చ‌ర‌ణ్ ఏం పనిచేశాడు?

- Advertisement -

క‌ష్టాల్లో ఉన్న కుటుంబాల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల‌తో ప‌ని చేయించి ఆ సంపాదించిన న‌గ‌దుతో పాటు కొంచెం క‌లిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి ‘మేము సైతం’ షో టీవీల్లో ప్ర‌సార‌మ‌వుతోంది. మంచుల‌క్ష్మి ప్ర‌స‌న్న హోస్ట్‌గా ఈ షో కొన‌సాగుతోంది. టీవీలో ఈ షో విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. ఈ షొ గ‌తేడాది ప‌లువురు సినీ న‌టుల‌తో కొన‌సాగించారు.

ఈ షో సంద‌ర్భంగా న‌టీన‌టుల‌తో ప‌లు ప‌నులు చేయించి వాటి ద్వారా వ‌చ్చిన న‌గ‌దును బాధిత కుటుంబాల‌కు అంద‌జేసే కార్య‌క్ర‌మంగా తీర్చిదిద్ద‌దారు. ఇప్పుడు ఈ షో టీవీలో ప్ర‌సార‌మ‌వుతోంది. ఆపన్నులను ఆదుకునేందుకు ఇది ఒక ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పటివరకు చాలామంది స్టార్స్ మేము సైతం కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు.

విభిన్న కార్యకలాపాల ద్వారా నిధులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించారు. ఇప్పుడు ఈ షోకు చిట్టిబాబు అదే రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ హాజ‌రు కానున్నాడు. ఈ షో సంద‌ర్భంగా గీతాంజలి ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో రామ్‌చరణ్‌తో ప‌ని చేయించారని తెలుస్తోంది. మ‌రి రామ్‌చ‌ర‌ణ్ ఏం చేశాడో టీవీలోనే చూడాలి.మొన్న అనుష్క పెట్రోల్ అమ్మి ఈ షోలో పాల్గొన‌గా ర‌కుల్ రోడ్డుపై ఏదో ఒక కార్య‌క్ర‌మం చేసింది. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే టీవీలో క‌నిపించ‌నున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -