Thursday, March 28, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ స్థానంలో మ‌రో స్టార్ హీరో….?

- Advertisement -

బాహుబలి ప్రాజుక్టుతో దేశం గర్వపడే భారీ సినిమా చేసి ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాకు ఎవరూ ఊహించని కాంబినేషన్ సెట్ చేశాడు. టాలీవుడ్ చిత్ర సీమలో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న రామ్ చరణ్, జూ ఎన్టీఆర్‌లతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే రాజ‌మౌలికి రామ్ చ‌ర‌ణ్ షాక్ ఇచ్చార‌నే వార్త‌ల ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎన్టీఆర్ అర‌వింద‌స‌మేతా, రామ్‌చ‌ర‌ణ్ బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఆసినిమాలు పూర్త‌యిన వెంట‌నే రాజ‌మౌలి మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ప్రారంభం కావాల్సిఉంది. ఈ సినిమాకు సంబంధించి మేకోవ‌ర్ కూడా విదేశాల్లో పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ఈ సిన‌మాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అభిమానుల‌కు బిగ్ షాక్ త‌గిలింది.ఈ సినిమానుంచి చిట్టిబాబు త‌ప్పుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌నాలే వినిపిస్తున్నాయి. అల్లు అర‌వింద్ రూ.500 కోట్ల‌తో రామాయ‌ణం సినిమా నిర్మిస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఒక ముఖ్య‌పాత్ర చేయనున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య‌మైన ప‌నుల‌న్నింటినీ రామ్ చ‌ర‌ణ్‌కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

మ‌రో వైపు సైరా మూవీనీ సొంత‌గా రూ.200 కోట్ల భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నారు కాబ‌ట్టి ఆ సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. రాజ‌మౌళి సినిమా అంటే అంత తొంద‌ర‌గా పూర్తికాదు. బోయ‌పాటి మూవీ, సైరా, రామాయ‌ణం సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఇక రాజ‌మౌలి సినిమా చేయ‌డం రామ్‌చ‌ర‌ణ్‌కు క‌ష్ట‌మే. అదుకే ఆ సినిమానుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్ త‌ప్పుకుంటే రాజ‌మౌలికి న‌ష్టం ఉండ‌ద‌నేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల భావ‌న‌. అవ‌స‌రం అయితే బాలీవుడ్ హీరోను కూడా న‌టింప‌చేయ‌గ‌ల‌డు. ఇదిలాఉంటే రామ్‌చ‌ర‌ణ్ స్థానంలో మ‌హేష్‌బాబును తీసుకుంటార‌నే వార్త‌లు మ‌రో వైపు వినిపిస్తున్నాయి. ఈయితే ఇందులే ఎంత నిజ‌ముందో రామ్‌చ‌ర‌ణ్ గానీ రాజ‌మౌలి గాని క్లారిటీ ఇవ్వాల్సిఉంది. దీనిపై స్పందిస్తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -