కుటుంబ కథా చిత్రలు, పెళ్లి నేపథ్యంలో సినిమాలు తీయాలంటే ఆ దర్శకుడే తీయాలి అని ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా అదే మాట అంటారు. మరీ అలాంటి సినిమాలు తీసిన దర్శకుడు కృష్ణవంశీ. సినిమాలో వినోదంతో పాటు ఏదైనా సందేశం ఇవ్వడంలో కృష్ణవంశీ అందె వేసిన చేయి. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, ఖడ్గం, మురారి లాంటి సూపర్హిట్ సినిమాలు తీశాడు.
అయితే ఇటీవల కృష్ణవంశీ వరుస పరాజయాలు పొందుతున్నాడు. దీంతో సినిమా పరిశ్రమకు కొన్నాళ్లు దూరమయ్యారు. ట్రెండ్కు తగ్గట్లుగా సినిమాలు చేయలేకపోయారు. ‘నక్షత్రం’ సినిమా తీసి చేజేతులా పరాజయం పొందాడు. ‘నక్షత్రం’ సినిమాతో కృష్ణవంశీ ఇండస్ట్రీకి దూరం కావాలనే అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతం మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఓ హీరోను సంప్రదించగా ఆ హీరో ఈ దర్శకుడికి షాకిచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం తన సినీ ప్రయాణం కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కథ రాసుకొని సిద్ధమయ్యాడు. ఒక వైవిధ్యమైన కథ సిద్ధం చేసుకొని దగ్గుబాటి రానాకు వినిపించాడు. అయితే ఈ కథ రానాకు నచ్చలేదని తెలిసింది. కథ నచ్చితే వంశీ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సినిమా చేద్దామని భావించిన రానా కథ బాగాలేకపోవడంతో చేయలేనని చెప్పేశాడు. ఈ విషయం మర్యాదపూర్వకంగా వంశీకి చెప్పాడంట. రానా అంగీకరించకపోవడంతో ప్రస్తుతం కృష్ణవంశీ వేరే హీరో కోసం ఈ సినిమా కథ వినిపించనున్నాడు.