Friday, April 19, 2024
- Advertisement -

రష్మీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్..!

- Advertisement -

తాజాగా యాంకర్ రష్మీ చేసిన పనికి సుడిగాలి సుధీర్ కన్నీళ్లు పెట్టున్నాడట. అసలు రష్మీ ఏం చేసింది ? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. వీరిద్దరు ఒకే దగ్గర కనిపిస్తే చాలు వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు. వీరు కూడా తమ మధ్య ఏదో ఉన్నట్లే బిహేవ్ చేస్తారు. వీర్ లవ్ ట్రాక్, రొమాన్స్ అనేది జనాల్లో ఎప్పుడూ హాట్ ఇష్యూనే.

అయితే ఇటీవలే సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ ప్రోగ్రామ్ లో రష్మీ సహా శేఖర్ మాస్టర్, ప్రదీప్, వర్షిణి, హైపర్ ఆది సందడి చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి రష్మీ వస్తుందో రాదో అని సుధీర్ బాగా డౌట్ పడ్డాడట.

కానీ రష్మీ వచ్చి సడెన్ సర్ ఫ్రైజ్ చేయడంతో సుధీర్ ఆనందంతో ఉప్పొంగిపోయి ఆనందభాష్పాలు కార్చారట. ఈ లెక్కన వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్‌గా ఉందని.. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడని డైలాగ్స్ ట్రెండీగా ఉన్నాయని.. తప్పకుండా ఈ సినిమా ద్వారా సుధీర్ పెద్ద స్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నా అని రష్మీ ఈ సందర్భంగా మాట్లాడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -