Thursday, April 25, 2024
- Advertisement -

సాయి ధరమ్ తో రెజీనా ఒప్పుకుంటుందా?

- Advertisement -

రేయ్ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగుపెట్టినా సాయి ధరమ్ తేజ్ కి పేరు వచ్చింది మాత్రం తన రెండో సినిమా పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా తో. ఈ సినిమా లో సాయి రెజీనా తో రొమాన్స్ చేసాడు. అప్పటికే రెజీనా ఎస్టాబ్లిష్ అయిపోయిన హీరోయిన్. అయితే వీరి ఇద్దరి కెమిస్ట్రీ కి మంచి పేరు రావడం తో వెంటనే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా లో కూడా వీరు ఇరువురు నటించడం జరిగింది.

వారు సినిమాలు చేస్తున్నప్పుడు వీరి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది అని, ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని చాలా మంది రాశారు కానీ ఇద్దరూ ఎప్పటికి అప్పుడు ఈ రూమర్స్ ని తప్పుబడుతూ వచ్చారు. ఒక దశ లో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని కొంత మంది రాయడం తో ఇద్దరూ కొద్దీ రోజులు సినిమాలు చేయకుండా ఉండాలని నిర్ణయించుకొని దూరం గా ఉండటం మొదలు పెట్టారు. బయట కూడా చాలా తక్కువ కలిసేవారట.

అయితే ఈ ఇద్దరినీ ఇప్పుడు మరలా ఒక సినిమా తో దగ్గర చేయనున్నాడట మారుతీ. దర్శకుడు మారుతీ త్వరలో సాయి తో ఒక సినిమా చేయనున్నాడు. గీత ఆర్ట్స్ లో ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. ఈ సినిమా కోసం రెజీనా ని హీరోయిన్ గా అప్రోచ్ అయ్యారట దర్శక నిర్మాతలు. అయితే రెజీనా ఇంకా స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -