Friday, March 29, 2024
- Advertisement -

బాలయ్యను దిష్టి బొమ్మ అన్న వర్మ.. ఎందుకు ?

- Advertisement -

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు విషయంపై హాట్ హాట్ చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేలు అంతా కూడా మండలి గ్యాలరీలో కూర్చుని సభ్యుల స్పీచ్ లు వినేందుకు వెళ్లారు. ఆ టైంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పక్కనే వైసీపీ ఎమ్మెల్యే రోజా కూర్చున్నారు. ఆ టైంలో సెల్ఫీ తీసుకోవడం ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బాలకృష్ణతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం జరిగింది. బాలయ్య, రోజా సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఈ సెల్పీ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన వర్మ.. రోజా గారు చూడ్డానికి హీరోలా ఉన్నారు. కాని ఆమెకు కుడి పక్కన ఉన్నది ఎవరో తెలియదు కాని బాలేడు. ఆయన రోజా గారి అందంను నాశనం చేసే విధంగా ఉన్నాడు. లేదంటే అతడు ఆమె యొక్క దిష్టి బొమ్మ అయ్యి ఉంటాడు అంటూ వర్మ రెండు వేరు వేరు ట్వీట్స్ చేశాడు. ఈ ట్వీట్స్ పై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అక్కడ బాలయ్యతో సెల్ఫీ తీసుకుంది రోజా.

బాలయ్యపై ఉన్న గౌరవం మరియు అభిమానంతో ఆమె సెల్ఫీ తీసుకుంది. ఆయన అంటే వైకాపా ఎమ్మెల్యేల్లో కూడా చాలా మందికి అభిమానం. టాలీవుడ్ లో మంచి నటుడు.. అలాంటి వ్యక్తిని దిష్టి బొమ్మ అంటావా అంటూ తీవ్ర స్థాయిలో వర్మపై మండిపడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. మొత్తానికి వర్మ నందమూరి ఫ్యాన్స్ ని కెలికి తిట్లు తింటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -