బాహుబలి
తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్
. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్- రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీపై జాతీయ స్థాయిలో హైప్ ఏర్పడింది. దీనికితోడు రాజమౌళి ఎంచుకున్న కథ యూనివర్సల్ కాన్సెప్ట్ కావడం ఈ హైప్ మరింత పెరగడానికి కారణమని చెప్పొచ్చు.
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు ఏం చేశారు? ఆ ఇద్దరూ కలిసి ఆంగ్లేయుల్ని ఎలా ఎదుర్కొన్నారు? అన్న కథను ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో తనదైన మార్క్ హంగులతో రాజమౌళి చూపించబోతున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్.. చరణ్ కి జోడిగా అలియా భట్ నటిస్తోంది.
భారీ బడ్జెట్తో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్.. తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలో కనిపిస్తారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ మూడు పాత్రల్లో ఒకటి రాబరీలు చేసే పాత్ర. రైళ్ల నుంచి బాంబ్ లు .. వెపన్స్ దొంగిలించే దొంగగానూ ట్రీటిస్తాడట. ప్రస్తుతం అల్లూమీనియం ఫ్యాక్టరీ లో ఆర్ ఆర్ ఆర్
టీమ్ సైలెంట్ గా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంటికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.