Thursday, April 25, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో మూవీ స్టోరీ..!

- Advertisement -

సంక్రాంతి అనగానే మనకు పెద్ద సినిమాలు గుర్తొస్తాయి. ఈ సారి సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒక్కటి సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, మరొకటి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడీ, మాస్ తో జనాలను ఆకట్టుకోబోతున్నాడు మహేష్. ఈ సినిమాకి అనిల్ రావుపూడి డైరెక్షన్ చేస్తున్నాడు.

అతడు తరహాలో ఈ సినిమా ఉంటుందట. మిలటరీ ఆఫసర్ గా ఉన్న మహేష్ ఫ్రెండ్ చనిపోవడంతో అతడి ఊరు అయినటువంటి కర్నూల్ వెళ్లి.. ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవడం అనేది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం అంటున్నారు. కామెడీ టచ్, యాక్షన్ సీన్స్ జోడించి, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

మొదటి భాగంలో వచ్చే 30నిమిషాల ట్రైన్ ఎపిసోడ్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, రెండవ భాగంలో హీరోని హైలెట్ చేయడం, విజయశాంతి డిగ్నిఫైడ్ యాక్షన్, మహేష్ యాక్షన్ సినిమాలో హైలైట్ కానున్నాయి. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల వైకుంటపురంలో. ఈ సినిమాలో ఒక కోటీశ్వరుని కొడుకు, ఓ కారు డ్రైవర్ కొడుకు చిన్ననాటి నుంచి రివర్స్ లో పెరుగుతారు.

అంటే కోటీశ్వరుడు పేదవాడిగా, కారు డ్రైవర్ కోటీశ్వరుడుగా పెరుగుతారు.అందుకు కారణం పెద్దయ్యాక తెలుస్తోంది. కోటీశ్వరుని క్యారెక్టర్ పాత్రలో సుశాంత్ నటించగా.. పేదవాడి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. సాంగ్స్, ఫైట్స్, కామెడీ ఈ సినిమాలో హైలైట్స్ కానున్నాయట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -