Friday, April 19, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు స్టోరీ లీక్.. అదిరింది..!

- Advertisement -

మహర్హి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ సినిమాలో మహేష్ సరసరన రష్మిక నటిస్తోంది. యంగ్ డైరెక్తర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రమబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ముఖ్యపాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సింగిల్ సాంగ్, పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.

ఓ పోస్టర్ లో మహేష్ బాబు గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిలబడి ఉన్న స్టిల్ చూసి మహేష్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో సినిమాపై భారీగా క్రేజ్ పెరిగిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం కొండా రెడ్డి బురుజు సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి అక్కడ ఫైట్ సన్నివేశాలు చిత్రికరించారట. అయితే సినిమాలో ఆర్మీ ఆఫీసరుగా కనపడాల్సిన మహేష్ బాబు ఇలా గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడని అందరు అనుకుంటున్నారు.

అయితే ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో మహేష్ క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే.. ఎవరు చంపారు అనేది తెలుసుకోవడం కోసం మహేష్ కర్నూల్ వెళ్తాడని అదే అసలు కథ అని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ వైరల్ అవుతున్న కథ మాత్రం ఇంట్రెస్ట్ గా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -