యువ కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం రణరంగం సినిమా ని థియేటర్ల లో కి తీసుకొని రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. శర్వానంద్ ఎంతో ఇష్టం గా చేసిన సినిమా ఇది. కాకపోతే శర్వానంద్ మాత్రం మొదట్లో చూపించిన ఇంటరెస్ట్ ని ఇప్పుడు ఈ సినిమా మీద చూపించడం లేదు అనే కంప్లైంట్ ఇండస్ట్రీ లో నడుస్తుంది. అయితే శర్వానంద్ ఇటీవలే తన కి తగిలిన ఇంజూరీ నుంచి కోలుకొని మళ్ళీ సినిమాలు షూటింగ్ మొదలు పెడుతున్నాడు.
శర్వానంద్ డిశ్చార్జ్ అయినా కొన్ని రోజులకే రానంరంగం యూనిట్ సినిమా కి సంబందించిన టీజర్ ఒకటి విడుదల చేసింది. అయితే ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అని ముందు నుండి అందరూ ఎంతగానో ఆసక్తి గా ఎదురు చూసారు. మేకింగ్ పరంగా, శర్వానంద్ లుక్ పరంగా మంచి టాక్ వచ్చినా ఈ హీరో ఆశించిన రేంజ్ లో టీజర్ కి రెస్పాన్స్ రాకపోవడం తో నిరాశ కి గురయ్యాడట.
సుధీర్ వర్మ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా కి కంటిన్యు గా ప్రమోషన్స్ జరగాలి కానీ శర్వానంద్ పూర్తి గా ఇంటరెస్ట్ చూపని కారణం గా ప్రమోషన్స్ అలా మధ్యలో ఆగిపోయాయి అనే టాక్ నడుస్తుంది.