పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందరి హీరోలకు అభిమానులు ఉంటారు కానీ పవన్ కి భక్తులు ఉంటారు. ఫ్యాన్స్ ఆయనను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు. పవన్ను సినిమాల ద్వారా కంటే వ్యక్తిగతంగా ఎక్కువ మంది ఇష్ట పడుతారు. అయితే తాజాగా పవన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
అప్పట్లో పవన్ గుండు చేయించుకున్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఓ రాజకీయ నాయకుడు తమ వ్యక్తిగత తగాదాల కారణంగా పవన్ గుండు కొట్టించాడని పలు వార్తలు వినిపించాయి. అయితే తర్వాత ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గజిని చిత్రం తెరకెక్కి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కథకి ముందుగా పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకున్నాడట ఏఆర్ మురుగదాస్. పవన్ కి మురుగదాస్ కథ చెప్పడంతో ఓకే అన్నాడట.
దాంతో గజిని పాత్ర కోసం పవన్ గుండుతో ఫోటో షూట్ చేయగా.. ఆ ఫోటోలు చూసిన పవన్.. తాను ఈ పాత్రకి సూట్ అవ్వనని ఆ సినిమాని ఆపేశాడట. అయితే అక్కడ పనిచేసే కొందరు వ్యక్తుల ద్వారా ఈ ఫోటోలు బయటకు రావడంతో పవన్ అంటే పడని కొందరు వ్యక్తులు ఇలా అసత్య వార్తలను ప్రచారం చేశారట. ఇక పవన్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.