జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ‘గులాబీ’ చిత్రంలో మొదటి సారిగా ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ అనే పాటతో సింగర్గా మారింది సునీత. ఆ సినిమా తర్వాత ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడి టాప్ సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది.
టాప్ సింగర్గా ఉన్న సునీత లైఫ్లో చాలా చేదు విషయాలు కూడా ఉన్నాయి. ఆమె తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భర్త కిరణ్ నుంచి విడిపోవడానికి కారణాలతో పాటు.. తన తో లిక్ పెట్టిన రాజకీయ నాయకుల వరకు క్లారిటీ ఇచ్చింది సునీత.
ఈ సింగర్ కు నిజమాబాద్ ఎంపీ మధు యాష్కీ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన సునీత తాను అందంగా పుట్టడం వల్లే ఇలాంటి రూమార్స్ తనపై వచ్చాయని వెల్లడించింది. ఓ వేడుకలో మధు యాష్కీ తనను పోగడటం వల్ల ఈ రూమర్స్ రాసుకొచ్చారని ఆమె తెలిపింది. అలాగే టాలీవుడ్ కి చెందిన మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా తనకు లీక్ ఉందని వార్తలు రాస్తున్నారని.. అసలు ఈ వార్తలు అన్ని ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదని.. ఆవేదన వ్యక్తం చేసింది ఈ అందమైన సింగర్. మరి ఇవడపై ఇంకెన్ని రూమార్స్ బయటకు వస్తాయో చూడాలి.
Related