Thursday, April 25, 2024
- Advertisement -

దర్శకుడి కామెంట్స్ మండిపడ్డ చిన్మయి..!

- Advertisement -

చిన్మాయి శ్రీపాద వివదాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎన్నో అందమైన పాటలు పాడిన ఆమె.. చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది. అయితే సమాజంలో అమ్మాయిలపై ఎలాంటి దారుణాలు జరిగిన వెంటనే చిన్మయి స్పందిస్తోంది. అవసరమైతే అందుకు కారణమైన వాళ్లు తిడుతుంది కూడా.

అయితే గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై చిన్మయి చేసిన ఆరోపణలు పెను సంచలనం రేపాయి. సినిమా రంగంలోని చీకటి కోణాన్ని ఆమె బహిరంగం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత పలుసార్లు సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్త్రీలపై జరిగే అన్యాయాల గురించి మాట్లాడింది. తాజాగా మరోసారి ఓ తమిళ దర్శకుడు పై చిన్మయి విరుచుకు పడింది.

తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజా తాజాగా ఓ కామెంట్ చేశాడు. ఆడవారు చనువి ఇస్తేనే అబ్బాయిలు తప్పు చేస్తారని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తలను, బిడ్డలను చంపుతున్న ఆడవారి సంఖ్య ఎక్కువైందని ఆయన అన్నారు. అత్యాచారాలు జరగడానికి మహిళలే కారణమని ఆయన అన్నారు. ఒకప్పుడు కట్టుబాట్లతో ఉండే మహిళలు… సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్లు అదుపుతప్పుతున్నారని చెప్పారు.

దీంతో భాగ్యరాజా చేసిన కామెంట్స్ పై చిన్మయి మండిపడింది. అంతా ఆడవారే చేస్తున్నట్లు ఆయన మాట్లాడటం చాలా బాధకరం అని ట్విట్టర్లో తెలిపింది. ఇక భాగ్యరాజా చేసిన కామెంట్స్‌పై పలువురు మండిపడుతున్నారు. కాగా చిన్మయి చేసిన కామెంట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ వివాదం మరింత పెద్దదైయేలా ఉంది అని తమిళ జనాలు అంటున్నారు. ఇక చిన్మయి చేసిన కామెంట్ కి భాగ్యరాజా ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -