తెలుగు బుల్లి తెర ప్రేక్షకులని బిగ్ బాస్ 70 రోజుల పాటు అలరించింది. చివరి ఫైనల్ లో శివబాలాజీని విజేతగా నిలిచారు. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో.. హరితేజ కానీ, ఆదర్శ్ కానీ విన్నర్ గా నిలుస్తారని అనుకున్నారు చాలా మంది. కానీ ఆ అదృష్టం శివ బాలజీని వరించింది. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ నుండి 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు.
అందులో టాక్స్ పోగా.. శివ బాలాజీకి అందింది 35,00,000. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడూ అతనికి ఓ ప్రశ్న ఎదురైంది. ఒక వేళ టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తారనే ప్రశ్న ఎదురవగా.. స్టేజ్ పై చెబుతానని చెప్పారు. తీరా ప్రైజ్ మనీ గెలిచాక ఆ విషయం మర్చిపోయారో.. లేక టైం లేదని చెప్పలేదో తెలియదు కానీ.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో శివబాలీజీ గురించి ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది.
ఆ వార్త ఏంటంటే.. బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన ప్రైజ్ మనీని శివ అనాథ పిల్లలకు ఇచ్చాడని.. శివ బంధు వర్గం నుండి ఈ వార్త లీక్ అయ్యిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే శివ బాలాజీకి మాత్రం బిగ్ బాస్ షోలో 70 రోజులు ఉన్నందుకు అదనంగా 60 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది.