Wednesday, April 24, 2024
- Advertisement -

ముంబైలో నా పరువు పోయింది : శ్రీముఖి

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమె పలు షోస్ చేస్తూ సందడి చేసి ఫాలోయింగ్ సంపాధించుకుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ అలరిస్తోంది.

తన చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాలను చెప్పింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ముంబైలో ఓ సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ తో తన పరువంతా పోయిందని.. ఒక్కసారిగా షాక్ అయ్యానని చెప్పింది శ్రీముఖి. ఓ సారి ఫ్రెండ్స్ తో ముంబై టూర్ కి వెళ్లిందట శ్రీముఖి. ఆ టూర్ లో బాగా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేసిందట. అక్కడ బార్గెనింగ్ చేస్తూ.. రోడ్లపై డాన్సు చేస్తూ రచ్చ చేసిందట. అయితే చివరకు అదే టూర్‌లో తన పరువు మొత్తం పోయిందని చెబుతూ మురిసిపోయింది శ్రీముఖి.

“అక్కడ మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టరన్న ఉద్దేశ్యంతో అన్ని చోట్ల తిరిగాను. షాపింగ్ చేసి వస్తూ బిచ్చగాళ్లలా రెండు చేతుల్లో సంచులు పట్టుకుని నడుస్తూ వస్తున్నాం. అయితే అక్కడ ఓ అబ్బాయి నన్ను గుర్తుపట్టి.. మీరు శ్రీముఖి కదా అన్నాడు. ఆ రూపంలో నన్ను చూసి అతను కూడా షాకయ్యాడు. అలా ముంబైలో నా పరువు పోయింది” అని శ్రీముఖి చెప్పుకొచింది. ప్రస్తుతం శ్రీముఖి ఇట్స్ టైం టు పార్టీ అనే సినిమాలో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -