Friday, April 26, 2024
- Advertisement -

సీఎం జగన్ కే సూచనలు ఇస్తున్న శ్రీరెడ్డి

- Advertisement -

సినీ పరిశ్రమలో శ్రీరెడ్డి నానా హంగామా చేసింది. సోషల్ మీడియాను వేధికగా చేసుకుని ఇతరలపై రెచ్చిపోతుంది. తారుచుగా పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అలా ఎప్పటికి అప్పుడు వార్తల్లో ఉంటుంది. తాజాగా ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టింది. ఇటీవలే జగన్ తో చిరంజీవి భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ భేటీపై శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. ఏకంగా జగన్ కే సూచనలు ఇస్తోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు జగన్ కు సుచనలు ఇస్తోంది. పెట్టుబడులపై ఫోకస్ చేయాలని.. రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా పెట్టుబడులు రాబట్టాలని ఆమె కామెంట్స్ చేసింది. పారిశ్రామిక పురోగతి, వ్యవసాయ రంగ అభివృద్ది రాష్ట్రానికి వెన్నెముక అని జగన్ కి హితబోధ చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీరు బాధ్యాయుతమైన తండ్రిలాంటి వారని వ్యాఖ్యానించింది.

ఇక చిరు సూపర్.. వైసీపీ మేమందరం మీకు ఫుల్ సపోర్ట్ అంటూ శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది. జగన్ ను చిరు కలిసిన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టింది. జగన్ గారూ.. మీరు ప్రతీ రాష్ట్రంలోని వీవీఐపీ, ధనవంతులు, రాజకీయ నేతలు.. ముఖ్యంగా ఎన్నారైలతో స్నేహపూర్వకంగా ఉండండి.. వారు మీకు ఎన్నో రకాలుగా సాయం చేయగలరు. మీకంటే పెద్దవారైన కొందరిని గురువుగా స్వీకరించండి.

సీనియర్ రాజకీయ నాయకులను నిర్లక్ష్యం చేయవద్దంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా కాలేజీల్లో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు బాక్సులను ఏర్పాటు చేయాలని.. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని శ్రీరెడ్డి పోస్ట్ ద్వారా తెలిపింది. జగన్ లాంటి వ్యక్తికి నువ్వు సూచనలు ఇవ్వడం ఏంటి అని వైసీపీ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై మండిపడుతుంటే.. మరికొందరు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -