Tuesday, March 19, 2024
- Advertisement -

నాకు అభిరామ్ ఫస్ట్ నైట్ అక్కడే అయింది : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డి అంటే సంచనాలకు కేరాఫ్ అడ్రెస్. తన జోలీకి ఎవరు వచ్చిన ఊరుకోదు. వాళ్లను నోటికి వచ్చినట్లు తిడుతుంది. ఇటీవలే కరాటే కళ్యాణి , డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పైన బూతుల వర్షం కురిపించింది. రాకేష్ మాస్టర్ తనని డిన్నర్ కి పిలిచాడని.. కరాటే కళ్యాణి ఇప్పటివరకు ముగ్గురు భర్తలను వదిలేసిందని.. వాళ్లపై ఫైర్ అయింది.

తాజాగా మరో వివాదాన్ని రేపింది శ్రీరెడ్డి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియోను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేశారని ఇటీవలే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ స్టూడియో ఉండబోదని కొందరు అంటున్నారు. అయితే ఇక్కడ స్టూడియోను అమ్మేసి వైజాగ్ లో ఉన్న స్టూడియోను అభివృద్ధి చేయాలని సురేష్ బాబు చూస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఇదే విషయంపై నటి శ్రీరెడ్డి స్పందించింది. “ఎక్కడైతే నాకు అభిరామ్ కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ రామానాయుడు స్టూడియో త్వరలో కనుమరుగు అవ్వనుంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు శ్రీరెడ్డిని దారుణంగా తిడుతున్నారు. ఎంత మంది నిన్ను వాడుకున్నారు. ఒక మహిళవై ఉండి ఇలా చేస్తావా ? అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -