Friday, April 19, 2024
- Advertisement -

ఓపెన్ ఆఫర్ తో రెచ్చగొడుతున్న శ్రీరెడ్డి..!

- Advertisement -

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఉద్యమానికి నాంది పలికి పెద్ద రచ్చ చేసింది నటి శ్రీరెడ్డి. దాంతో ఆమెకు ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమాల్లో ఛాన్స్ కోసం వస్తున్న ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు మంట గలుస్తున్నాయంటూ శ్రీరెడ్డి హంగామా చేసింది. బడా దర్శకనిర్మాతలు చాలా మందిని లైంగికంగా వేదిస్తున్నారని ఆరోపణలు చేసింది.

ఆ తర్వాత ఆమె కోలీవుడ్ వెళ్లింది. అక్కడ కూడా పలు దర్శకనిర్మాతలపై, హీరోలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తిరమైన, వివాదకరమైన పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె పెట్టే ఫోస్టులపై కొందరు ఫైర్ అవుతే.. మరికొందరు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

తాను బికీనీ ధరించి పోజులిచ్చేందుకు సిద్దంగా ఉన్నానని.. ఎవరైనా మ్యాగజైన్ వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటే సంప్రదించవచ్చు అని పేర్కొంటూ ఫేస్‍బుక్ పోస్టు పెట్టింది. పైగా అందుకు గాను ఎంతిచ్చినా ఓకే అని చెప్పింది. తాను బీకినీ ధరించి సంపాదించిన సొమ్ము ఎంతైన సరే.. తమిళనాడులోని బీదవాళ్ళకి, బెగ్గర్స్ కి ఇస్తానని శ్రీరెడ్డి చెప్పింది. ఇప్పుడు ఆమె పెట్టిన పోస్టు చూసి నెటిజన్లు మేమంటే మేము షూట్ చేస్తాం అని ఎగబడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -