Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రియాంక హత్యపై స్పందించిన శ్రీరెడ్డి..!

- Advertisement -

ప్రియాంకరెడ్డి హత్య ఘటన యావత్ భారత దేశాన్ని కలిచివేసింది. ఈ హత్యను దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు. డాక్టర్ ప్రియాంకర్ రెడ్డి తరుపున యావత్ లోకం నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రల్లో ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై శ్రీరెడ్డి స్పందించింది.

మాములుగా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి తరుచు ఏదో ఒక విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. ఆమె పోస్టులు ఎలా ఉన్నప్పటికి ఆమె ఫాలోయింగ్ మాత్రం తగ్గడం ఏదు. ప్రియాంకరెడ్డి హత్యపై స్పందిస్తూ..”ఒక్కప్పుడు పేరెంట్స్ కడుపులోనే బిడ్డను చంపేసేవారు. కడుపులో ఆడపిల్ల అని తెలిస్తే ఇలా చేసేవారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులనే తీసుకొస్తున్నారు రేపిస్టులు. వాళ్ళు చేసే పనులు చూసి పేరెంట్స్ మళ్ళీ ఆ ఆలోచనలో పడే పరిస్థితులు కల్పిస్తున్నారు” అంటూ కాస్త పవర్‌ఫుల్ సందేశమే పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

ఈ పోస్టుపై పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. . శ్రీ రెడ్డి చెప్పిన దాంట్లో ఆలోచించాల్సిన విషయం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి నటించిన క్లైమాక్స్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -