సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ రెచ్చిపోతుంది నటి శ్రీరెడ్డి. ఆమె ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ సారి ఏకంగా మీడియా వర్గాలపైనే పడింది. పలు యూట్యూబ్ ఛానెల్స్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయంలోకి వెళ్తే.. కాస్టింగ్ కౌచ్ అంటూ ఓ మంచి ఉద్యమమే లేవనెత్తిన శ్రీ రెడ్డి. పలువురు సినీ ప్రముఖులకు చుక్కలు చూపిస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్లో పవన్, చిరంజీవి, నాని, విశాల్ లాంటి అగ్ర హీరోలను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇదిలా ఉండగానే తాజాగా పలు యూట్యూబ్ ఛానెల్స్పై కూడా కన్నేసి వాళ్లందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ”తెలుగు, తమిళ యూ ట్యూబ్ ఛానెల్స్.. ఎవరైనా కానీ నా వీడియోలు స్పూఫ్ చేసి వాడుకున్నారంటే మీకు చుక్కలు చూపిస్తా, ఆ తర్వాత నేనేం చేస్తానో మాత్రం చెప్పలేను” అంటూ ఫేస్బుక్లో షాకింగ్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.
ఈ పోస్ట్ చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈమె ఉన్నట్టుండి యూట్యూబ్ ఛానెల్స్పై పడిందంటూ చర్చించుకుంటున్నారు. నిజం చెప్పాలమంటే శ్రీరెడ్డిని సెలబ్రిటీని చేసిందే యూట్యూబ్ ఛానెల్స్. ఆమె గురించి వార్తలు రాస్తూ.. ఆమె వీడియోస్ పబ్లిష్ చేస్తేనే ఆమెకి ఈ క్రేజ్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానెల్స్ ను టార్గెట్ చేయడం చర్చలకు తావిస్తోంది. ఇక శ్రీరెడ్డి క్లైమాక్స్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.