Wednesday, April 24, 2024
- Advertisement -

నాగ్ ని బిట్టు అని ఎందుకు పిలిచానంటే.. : సుజాత

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజిన్ మొదలై ఆరు వారాలు పూర్తికావస్తుంది. ఇప్పుడు ఉన్నా వారిలో ఎవరు సేఫ్ అవుతారో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టంగా మారింది. . దేవి నాగవల్లి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడంతో అంతా షాకయ్యారు. గంగవ్వ ఆరోగ్యం బాలేక ఆమె బయటకు వచ్చింది. స్వాతి దీక్షిత్ వారం రోజులకే బయటకి వచ్చేసింది. ఇటీవల జోర్దార్ సుజాత కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

సుజాత టాస్కులు బానే ఆడింది. కానీ ఆమె నవ్వు మాత్రం ఫేక్ అని ఇంటి సభ్యులు అన్నారు. నాగార్జున వంటి స్టార్ హీరోని పట్టుకుని ‘బిట్టు’ అని పిలవడం.. ఆయన ఫ్యాన్స్ నే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. ఈమె ఎప్పుడెప్పుడు నామినేషన్స్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గతవారం ఆ అవకాశం దక్కింది. అదే ఈమె ఎలిమినేషన్ కు కారణమయ్యిందని చెప్పొచ్చు. ఇటీవల సుజాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు నాగార్జునను ‘బిట్టు’ అని ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పింది.

సుజాత మాట్లాడుతూ.. ” బిగ్ బాస్ కు వెళ్ళేటప్పుడు.. టీమ్‌ సభ్యులు..’మీకు నాగార్జున అంటే ఇష్ట‌మా?’ అని అడిగారు. అవును ఇష్టం అని చెప్పాను. ‘ఆయన్ని బిట్టు అని పిల‌వ‌డం నీకు ఇష్ట‌మేనా?’ అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను సరే అన్నాను. నేను అలా పిలిచిన‌ప్పుడు కూడా నాగార్జున స‌ర్ చాలా సంతోషప‌డ్డారు. అలా పిల‌వ‌డం కనుక నాగార్జున‌గారికి లేదా బిగ్‌బాస్ టీమ్‌కు ఇష్టం లేకపోతే వెంట‌నే నన్ను క‌న్ఫెష‌న్ రూమ్‌కి పిలిచి ‘అలా పిలవద్దని చెప్పేవాళ్లు’ కదా? వాళ్లంత‌ట వాళ్లే బిట్టు అని పిల‌వ‌మ‌న్నారు. అందుకే పిలిచాను తప్ప.. కావాలని కాదు” అని చెప్పుకొచ్చింది.

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

గంగవ్వ కోసం బిగ్ బాస్ ఎన్ని లక్షలతో ఇల్లు కట్టిస్తున్నారంటే ?

రష్మీకతో అఖిల్.. బొమ్మ హిట్ ఫక్కా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -