Friday, April 26, 2024
- Advertisement -

రాజశేఖర్ కూతురి తో సుకుమార్ బోల్డ్ మూవీ?

- Advertisement -

దొరసాని సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం కానున్న నటి శివాత్మిక రాజశేఖర్. రాజశేఖర్-జీవిత దంపతుల కుమార్తె అయినా శివాత్మిక ఈ సినిమా తో తన లక్ ని టెస్ట్ చేసుకోనుంది. అయితే ఒక వైపు ఇది ఇలా సాగుతుండగా, ఈ సినిమా విడుదల అవ్వక ముందే శివాత్మిక కి మరో అవకాశం వరించింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ కొత్త హీరోయిన్ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్నాడట.

ఇంతకు ముందు సుకుమార్ నిర్మాణం లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో రాజ్ తరుణ్ హీరో గా వచ్చిన కుమారి 21 F అనే సినిమా కి సీక్వెల్ చేసే యోచన లో ఉన్నారట సుకుమార్. అందుకోసం శివాత్మిక ని ఎంపిక చేసుకొని ఆమెతో ఈ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ దిశగా చర్చలు అయితే మొదలయ్యాయి కానీ దొరసాని విడుదల అయితే నే కానీ ఈ సినిమా గురించి ఒక నిర్ణయం తీసుకోలేరు అనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఆనంద్ దేవరకొండ హీరో గా పరిచయం అవుతున్న దొరసాని చిత్రం ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -