Friday, March 29, 2024
- Advertisement -

హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ విడాకులు..!

- Advertisement -

కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది శ్వేత బసు ప్రసాద్. చిన్న వయసులోనే మంచి నటిగా పెరు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె కేరీర్లో ప్రతిది ఊహించని మలుపే అని చెప్పాలి.

హీరోయిన్ గా ఉన్న శ్వేతపై వ్యభిచారం ఆరోపనలు.. అరెస్ట్ అనంతర పరిణామాలు తన లైఫ్ ను డైలామాలో పడేసింది. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆమె ఖండించినప్పటికి అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వత టాలీవుడ్ కి బై చెప్పి లఘు చిత్రాలు, డ్యాక్యుమెంటరీలతో కాలక్షేపం చేసింది. అనురాగ్ బసు లాంటి గురువుతో కలిసి పలు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసింది. ఈ క్రమంలో 2018 లో శ్వేతాబసు తన బోయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకుంది.

ఏదాది పాటు బానే ఉన్నారు. ఇంతలోనే ఏమైందో శ్వేతబసు ఊహించని షాకింగ్ ప్రకటనతో సోషల్ మీడియాల్ని వేడెక్కించింది. తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది. సరిగ్గా ఏడాదికే ఫ్యామిలీలో కలతలతో ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2018 డిసెంబర్ 13న పూణేలో రోహిత్- శ్వేతాబసు పెళ్లి జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -