- Advertisement -
టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డిపై యాక్షన్కు దిగుతున్నాడు తమిళ హీరో విశాల్. శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీలోని కొందరిపై వివాస్పద కామెంట్స్ చేసింది.మురుగదాస్,లారెన్స్, శ్రీకాంత్ తనను మోసం చేశారని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.దీంతోపాటు విశాల్ వైపు నుంచి తనకు బెదిరింపులు ఉంటాయేమోననే అనుమానాలను ఆమె వ్యక్తం చేయడం తమిళ ఇండస్ట్రీకి కూడా శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు.
తాజాగా ఆమె చేసిన వాఖ్యలపై తమిళ ఇండస్ట్రీ స్పందించాలని టి.రాజేందర్ అనడంతో విషయం మరింత వేడెక్కింది. దీంతో ఈ విషయం ఇక్కడితో ముగించాలని భావిస్తున్నాడు హీరో విశాల్.దీనిలో భాగంగానే ఎవరిపై అయితే శ్రీరెడ్డి ఆరోపణలు చేసిందో .. వాళ్లతో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టాలని విశాల్ భావిస్తున్నాడట. మరి వివాదానికి విశాల్ ఎలాంటి ముగింపునిస్తాడో చూడాలి.