Friday, March 29, 2024
- Advertisement -

దేవిశ్రీతో మాట్లాడక చాలా డేస్ అవుతుంది.. : తమన్

- Advertisement -

100కుపైగా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పని చేశాడు. ఆయనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటివలే ప్రతీ రోజూ పండగే, వెంకీమామ సినిమాలతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ’అల వైకుంఠపురములో’ సినిమా కోసం పని చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు.

’మిగిలిన మ్యూజీక్ డైరెక్టర్లతో పోలీస్తే.. తమన్ తో పని ఎక్కువ అవుతుందని అంటుంటారు. దానికి కారణం ఏంటి ?’ అని ప్రశ్నించగా.. ‘అదేం లేదు.. మిగిలిన వారితో పోలిస్తే నన్ను హ్యాండిల్‌ చేయడం చాలా సులభం. నేను పనిచేస్తున్న నిర్మాతలతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలిన వారి పారితోషికంతో పోలిస్తే.. నేను తీసుకునేది 50 శాతం తక్కువ. ఇది అందరికీ తెలిసిందే. ఇలా చూసుకుంటే నేను ఎంతో ఉత్తమం. హైదరాబాద్‌లో సరైన కళాకారులు లేరు. కానీ, ఇక్కడ బెస్ట్‌ సింగింగ్‌ టీం ఉంది. అందుకే చెన్నైకి వెళ్లి రికార్డింగ్‌ చేసుకుని వస్తుంటా. క్వాలిటీ కోసం మరింత సమయం కేటాయిస్తుంటా.

స్టూడియోలో అధిక గంటలు ఉండి మరీ పనిచేస్తుంటా. సినిమా చివరి రీల్‌ అమెరికా వెళ్లేంత వరకూ దర్శకుడితోనే ఉంటాను’అని తమన్ చెప్పుకొచ్చారు. దేవిశ్రీ సినిమా ’సరిలేరు నీకెవ్వరు’, మీది ’అల వైకుంఠపురములో’.. ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. మీపై ఒత్తిడి ఉందా ? అని ప్రశ్నించగా.. ’ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి. అప్పుడే మన స్థాయి తెలుస్తోంది. దేవితో మాట్లాడుతుంటాను. ఆయన చేసిన 9 సినిమాలకు నేను ప్రోగ్రామర్‌గా పనిచేశా. అతనితో చివరగా మాట్లాడి ఆరు నెలలు అవుతుంది. అప్పుడు అప్పుడు ట్విట్టర్లో మాట్లాడుకుంటాం’ అని తమన్ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -