అల వైకుంఠపురం సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడం వలన దేవిశ్రీప్రసాద్ ”సరిలేరు నీకెవ్వరు” టైటిల్ విషయంలో చాలా ప్రెజర్ ఫీలవుతున్నాడని.. ఆ కారణం చేత తమన్, దేవిల మధ్య సఖ్యత తగ్గిందని సోషల్ మీడియాలో మరియు పలు వెబ్ సైట్స్ లో రచ్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి తమన్ ముందుకొచ్చాడు.
తమ మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు ఉండవని.. ఎవరైన సాంగ్ కంపోజ్ చేసి అది హిట్టయితే తమదే అన్నట్లు ఫీలవుతామని తెలిపాడు సంగీత దర్శకుడు తమన్. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ మూడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని.. తమ మధ్య వర్క్ విషయంలోనే కాంపిటిషన్ తప్ప బయట మేం చాలా క్లోజ్ గా ఉంటాం.
ఏదైన సాంగ్ మంచి హిట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఎలాంటి విబేధాలు ఉండవని ఎవరూ ఫీలవ్వరనేది తమన్ వాదన. అల వైకుంఠపురములోని సామజవరగమనా సాంగ్ పెద్ద హిట్. అయితే తమన్.. దేవిశ్రీల మధ్య గట్టి పోటీ నడుస్తుంటే ఈ వాదనపై తమన ఈ విధంగా స్పందించాడు.