Friday, March 29, 2024
- Advertisement -

2019లో విడిపోయిన ప్రేమ జంటలు వీళ్లే..!

- Advertisement -

పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమా వాళ్ళ ప్రేమలు పెళ్లిళ్లు ఆ తర్వాత బ్రేక్ అప్.. లవ్ చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాదిలో ఈ జాబితా చాలా పెద్దదే ఉంది. కొంత కాలం డేటింగ్ చేశారు పెద్దల వరకు వెళ్లి వారి ప్రేమ పెళ్ళిగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడం ఒకరంటే ఒకరికి నమ్మకం పోవడంతో విడాకుల వరకు వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ ఏడాది అలా అంతా అవాక్కయ్యేలా చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. క్రమశిక్షణకు మారుపేరు అని పేరుంది మంచు ఫ్యామిలీకి. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో మంచు మనోజ్. 2015 మే 20న వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత నుంచి మానసికంగా డిస్టర్బ్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం సాగింది. కొన్ని విభేదాల కారణంగా విడిపోతున్నాం అని మనోజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

గత కొంతకాలంగా సినిమాకు తగ్గించుకుంటూ వచ్చిన శృతి హాసన్ మైఖేల్ కోర్సలే అనే వ్యక్తితో ప్రేమలో మునిగిపోయింది. వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా తీసుకెళ్లి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి కమల్ హాసన్ తో కలిసి సాంప్రదాయ కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అని వార్తలు షికారు చేశాయి. అయితే అనూహ్యంగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా తెలుగులో సినిమాలు తగ్గడంతో ప్రముఖ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది.

గత కొంతకాలంగా ఎక్కడపడితే అక్కడ ఈ జంట ప్రత్యక్షమైంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం తో ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని విభేదాల కారణంగా వీరు విడిపోయారు. కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయం అయిన శ్వేత బసు ప్రసాద్.. తర్వాత తెలుగులో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. వ్యభిచారం కేసు అంటూ దొరికిపోయిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. చివరికి అక్కడ తన స్నేహితుడు రోహిత్ పెళ్లి చేసుకుంది ఏడాది తిరక్కుండానే ఇద్దరూ విడాకులకు అప్లై చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -