Saturday, April 20, 2024
- Advertisement -

ఈ స్టార్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

- Advertisement -

నయనతార తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఆ తర్వాత తెలుగు తెరకు కాస్త గ్యాప్ ఇచ్చి ఇటీవలే సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన మంచి పేరు సంపాదించుకుంది. ఆమె విద్యాభ్యాసం ఎక్కువగా నార్త్ లో జరిగింది. సినిమా కెరీర్ ప్రారంభించే ముందు ఆమె బి.ఏ పూర్తి చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాల్లో దూసుకెళ్తున్న అందాల అనుష్క గత కొంతకాలంగా అనుకోకుండా కాస్త గ్యాప్ వచ్చింది. ఎంతో మంది అగ్ర కథానాయకులతో నటించడమే కాకుండా లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ఈ భామ. విజయశాంతి తర్వాత ఆ తరహా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం ఈమెకే సాధ్యమైంది అని చెప్పాలి. తెలుగులో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి.. కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసింది.

ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంత కంటే ఎక్కువ అని చెప్పాలి. ఒక్కోసారి హీరోయిన్ కోసం ఒకటి రెండు సార్లు సినిమా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి అందం అభినయం ఉన్న కథానాయిక సమంత. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ ఇంకా విజయవంతమై పరుగులు పెడుతోంది. చెన్నై లోని స్టెల్లా మేరీ కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ కోర్సు పూర్తిచేశారు సమంత.

తమన్నా ముంబైలోని మేనేజ్ ఛీఫ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదివారు. ఆర్ట్స్ లో పట్టా పొందారు. త్రిష చెన్నైలోని ఉమెన్స్ కాలేజ్ లో బిబిఏ పూర్తి చేశారు. కాజల్ కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్లో మార్కెటింగ్ విభాగంలో పట్టా పొందారు. జీసస్ అండ్ మేరీ కాలేజ్ లో చదివారు ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గణితంలో విద్యను అభ్యసించారు.

శృతి హాసన్ కూడా ముంబైలో కాలేజ్ లో సైకాలజీ చదివింది. రష్మీక సైకాలజీలో డిగ్రీ చేసింది. బెంగళూరుకు చెందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసింది నిధి అగర్వాల్. మంగళూరులో సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది ఇస్మార్ట్ పోరీ నభా నటేష్. ఇలా మీము ఎందులోను తక్కువ కాదు అన్నట్లు ఈ కథానాయికలు పోటీ ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -