Wednesday, April 24, 2024
- Advertisement -

బాలయ్య, విజయశాంతికి మధ్య గొడవకు కారణం ఏంటి?

- Advertisement -

నందమూరి బాలకృష్ణ, విజయశాంతి జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కల్సి 17సినిమాల్లో చేసారు. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద వర్కవుట్ అవుతుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య రగడకు ఓ సినిమా కారణం అయింది. విషయంలోకి వెళ్తే.. 1992లో భర్త శ్రీనివాస ప్రసాద్ తో కల్సి బాలయ్యతో విజయశాంతి ఓ సినిమా స్టార్ట్ చేసింది.

అప్పట్లో నాలుగు కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. దాంతో రిలీజ్ బాగా లేటయింది. 1993సెప్టెంబర్ 3న విడుదలైన ఈ సినిమా పేరు నిప్పురవ్వ. అప్పట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బయ్యర్స్ ఎక్కువ రేటుకి కొన్నారు. అయితే బాలయ్య ఈ సినిమా తర్వాత షూటింగ్ ప్రారంభించిన బంగారు బుల్లోడు మూవీ కూడా అదే సమయానికి రిలీజ్ రెడీ అయింది.

జగపతి ఆర్ట్ పిక్చర్స్ రాజేంద్రప్రసాద్ ఒక్కసారి కమిట్ అయితే వెనక్కి తగ్గడు. ఎవరి మాటా వినడు. అక్కినేని సైతం ఆయన మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. దాంతో సినిమా రిలీజ్ వాయిదా వేయమని స్వయంగా విజయశాంతి అడిగినా ఆయన నో అనేశాడు. బాలయ్య కూడా ఏమీ చేయలేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి.

ఇందులో బంగారు బుల్లోడు హిట్ కొట్టి,నిప్పురవ్వ ప్లాప్ తో విజయశాంతికి భారీ నష్టాన్ని మిగిల్చింది. బాలయ్య తరుపున ఎలాంటి తప్పు లేకపోయినప్పటికి.. ఆ తర్వాత విజయశాంతి మాత్రం బాలయ్యతో కల్సి నటించలేదు. తర్వాత ఇద్దరూ కలుసుకున్నా అంతకుముందున్న రిలేషన్ మాత్రం ఎప్పుడు కనిపించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -