Wednesday, April 24, 2024
- Advertisement -

శ్రీముఖి గెలుపు కోసం ఫ్యాన్స్ ఇలా చేశారు..!

- Advertisement -

బిగ్ బాస్ విన్నర్ ఎవరంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. ఇక మరో రెండు వారాల్లో ఈ షో ముగియనుంది. ఈ వారంలో మొత్తం ఏడుగురిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. మరో రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. చివరికి అదుగురు మాత్రమే మిగులుతారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అందరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా బలంగా ఉన్నారు. అందుకు తగ్గట్లే గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరికి మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే అందరికంటే కాస్త ఎక్కువ శ్రీముఖికి ఉంది. సోషల్ మీడియాలో ఆమె పేరిట శ్రీముఖి ఆర్మీ కూడా ఉంది. బిగ్ బాస్ రెండో సీజన్ లో కౌశల్ ఆర్మీ లా ఇది కూడా బిగ్ బాస్ ను శాసిస్తోంది. అయితే తాజా శ్రీముఖి నామినేషన్ కి రావడంతో ఆమె ఫ్యాన్స్ ఆమె కోసం డిఫరెంట్ గా ప్రచారం మొదలు పెట్టారు. శ్రీ,ముఖిని ఎలగైన విన్నర్ చేయాలని ఏకంగా థియేటర్స్ లోనే యాడ్స్ ఇస్తున్నారు. శ్రీముఖికి ఓట్ వేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రకటనలు థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.

సో మొత్తానికి శ్రీముఖిని గెలిపించడానికి ఆమె టీం బానే కష్టపడుతోంది. అయితే ఇలా శ్రీముఖి కోసం థియేటర్స్ లో యాడ్స్ ఇవ్వడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీముఖి హౌస్ లో మోనార్క్ లా బీహేవ్ చేస్తుందని.. ఆమె తరుపున ప్రచారం చేసిన మనీ వేస్ట్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి యాడ్స్ ఇవ్వడం వల్ల ఆమెకి వచ్చే ఓట్లు కూడా పోతాయని అంటున్నారు. కానీ శ్రీముఖి అభిమానులు మాత్రం దీనికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -