Friday, March 29, 2024
- Advertisement -

సాయి పల్లవిపై కంప్లైంట్లు ఎందుకొస్తున్నాయి

- Advertisement -

సాయి పల్లవి. అంటే తెలుగు జనాలు గుర్తించకపోవచ్చు. హైబ్రిడ్ పిల్లంటే ఫిదా చూసిన వారికి యాదకొస్తుందనుకుంట. ఈ పిల్ల మాలీవుడ్ ,కోలీవుడ్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది.అలాగే తెలుగులో ఫిదాతో వచ్చిన క్రేజ్ ఎక్కడికో అమ్మడిని తీసుకుపోయింది. అలాంటి సాయిపల్లవి ఇపుడు టాలీవుడ్లో హీరోల ఇచ్చే ఫిర్యాదులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంసిఏ చిత్రం చేసే సందర్భంలో నానితో గొడవ పడింది. ఇపుడు తాజాగా నాగశౌర్యతో వైరం కొని తెచ్చుకుంది. షూటింగ్ సెట్ లో కూడా కొన్ని విషయాల్లో మొండిగా ఉండడంతో అమ్మడి ప్రవర్తనపై కామెంట్లు పడిపోతున్నాయి.

ఎక్కడిదాకానో ఎందుకు… యంగ్ సక్సెస్ ఫుల్ హీరో నితిన్ ,దిల్ రాజు,వేగేశ్న సతీష్ కాంబోలో తెరకెక్కే సినిమాలో నేను చేయనో పో అంది. లైఫ్ ఇచ్చిన దిల్ రాజు సినిమాలో చేయననడం చూస్తుంటే..ఇక్కడేదో తేడా కొట్టింది. ఎందుకు చేయనన్నావు అని ఎవరో అడిగితే.. నితిన్ పెద్ద హీరో కాదంట కదా అని ఎవరో చెప్పినట్లు సమాధానం చెప్పిందట. అంటే సాయి పల్లవిని ఎవరో రాంగ్ గైడ్ చేస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. ఇక హీరోలంతా వరుసబెట్టి అమ్మడిపై చేస్తోన్న కంప్లైంట్లు కూడా సాయి పల్లవి కెరియర్ కు ఇబ్బందిగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -