యాంకర్ రష్మీ బుల్లితెర మీద హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది.ఇంకా చెప్పాలంటే రష్మీ యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన తరువాతే బుల్లితెరపై బ్యూటీ పెరిగిందని చెప్పాలి.ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోలో యాంకర్గా చేస్తున్న రష్మీకి ,ఈ షో ద్వారా బాగానే పాపులర్ అయింది.ఇక ఈ టీవీలోనే ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ ప్రోగ్రాంకు కూడా రష్మీ యాంకర్గా వ్యవహరిస్తుంది.ఢీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్,రష్మీ చేసే యాక్టింగ్కు విపరీతమైన స్పందన వస్తుంది.దీనికి సాక్ష్యామే యూట్యూబ్లో వీరి వీడియోస్కి అత్యధిక వ్యూస్. అసలు ఈ షో ఇంతటి హిట్ అవడానికి కారణం కూడా వీళ్లద్దరే.రష్మీ ,సుధీర్ కనిపిస్తే చాలు ఆ షో హిట్టే అన్నట్లుగా మారింది.ఢీ 10 ముగిసింది.తాజాగా ఢీ జోడి ప్రారంభమైంది.ఢీ జోడి అయితే మొదలైంది కాని ఇందులో రష్మీ ఎక్కడ కనిపించడం లేదు.
అయితే ఢీ జోడి నుంచి రష్మీ కావాలనే తప్పుకుందని తెలుస్తుంది.గత కొంతకాలంగా రష్మీ ,సుధీర్ ప్రేమలో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.అది కేవలం స్క్రీప్ట్ అని ఎన్నిసార్లు చేప్పిన బయట జనాలు నమ్మడం లేదు.దీంతో సుధీర్ చేసే షోలకి దూరంగా ఉండలని భావించే రష్మీ ఢీ జోడి నుంచి తప్పుకుందని తెలుస్తుంది.పైగా రష్మీ వేరే వ్యక్తితో ప్రేమలో ఉందట.అతను సుధీర్కు దూరంగా ఉండమని కోరడంతో రష్మీ ఢీ జోడి చేయడం లేదని సమాచారం.పైగా రష్మీ కొన్ని సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఢీ జోడికి డేట్స్ సర్దుబాటు చేయలేక తప్పుకుందని తెలుస్తుంది.మొత్తనికి సుధీర్ వల్ల రష్మీ ఢీ షో నుంచి తప్పుకుందని బయట వినిపిస్తున్న మాట. ఇక రష్మీ స్థానంలో ఢీ జోడి యాంకర్గా బిగ్బాస్ ఫేం భాను శ్రీని యాంకర్గా తీసుకున్నారు.మరి రష్మీ,సుధీర్ కాంబినేషన్కు అలవాటు పడిన ప్రేక్షకులు భాను శ్రీని ఎలా స్వీకరిస్తారో లేదో చూడాలి.