- Advertisement -
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసే స్థానం మారుతుందనే సంకేతాలు ఒడిషా భాజాపా లీడర్ ప్రదీప్ పురోహిత్ ఇచ్చారు. పూరీ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి మోదీ గెలిచారు. అయితే అక్కడ మోదీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
పూరి స్ధానం నుంచి ప్రధాని పోటీ చేసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒడిషా రాష్ట్ర ప్రజలు ప్రధాని పూరీ లోక్సభ స్ధానం నుంచి పోటీచేయాలని కోరుతున్నారని, మోదీ సైతం పూరీ నుంచి పోటీకి మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.