ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలకు మంటగలసి పోతున్నా. కంటకి రెప్పలా కాపాడాల్సిన తండ్రే తాగిన మైకంలో 12ఏళ్ల కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఇంట్లో భార్య లేని సమయంలో ఈదారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలోని అరుంధతిపేటలో జరిగింది.
వివరాల్లోకి వెల్తే……అరుంధతిపేటలోని ఓ వ్యక్తి భార్య, 12ఏళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. నిత్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతుండే వాడు. భర్త హింసను భరించలేని భార్య గొడవ జరిగినప్పుడల్లా పుట్టింటికి వెల్లేది. పుట్టింటికి వెల్లే సమయంలో తన 21ఏళ్ల కూతురిని ఇంటి దగ్గరె వదిలి వెల్లేది. ఇదే అదునుగా భారించని తాగి ఇంటికి వచ్చినప్పుడుల్లా కూతురిపై అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఆ చిన్నారి అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి శనివారం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి.. బాలిక గర్భవతని తేల్చారు.
ఈ విషయం తెలిసి షాకైన బాలిక తల్లి భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ రవికుమార్, సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అరుంధతిపేటకు వెళ్లి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసిన పోలీసులు డాక్టర నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.