కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు ఓ తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదానికి ఓ బైక్ కారణం అని తెలుస్తోంది. ఓ బైక్ను తప్పించబోయి తుఫాన్ వాహనాన్నివోల్వో బస్సు ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో కూడా చాలామంది పరిస్థితి అందళనకారంగా ఉందని సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్ధానికులు తుఫాను వాహనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా గద్వాల జల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే వీరు పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని గాయపడిన వారి కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.