Thursday, April 25, 2024
- Advertisement -

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..19 మంది మృతి..

- Advertisement -

తూర్పుగోదావరి  జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి వద్ద ఎన్‌హెచ్‌-16పై సిమెంట్‌లారీ బోల్తాపడింది.

19 మంది మృతి చెందారు. మరో 16 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. 

మృతులు తొండంగి, ప్రత్తిపాడు, తుని, రౌతులపూడి వాసులుగా గుర్తించారు. నిద్రమత్తు, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదమని తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా 35 మందిని ఎక్కించుకోవడమే కాకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించాడని తెలుస్తోంది. 

ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద జరిగిన తీరుపై ఫోన్ చేసి ఆరా తీశారు. చనిపోయిన కూలీల కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. ఘటన జరిగిన తీరుపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -